Corona Virus: తెలంగాణలో కొత్త‌గా 535 కరోనా కేసులు

  Media Bulletin on status of positive cases COVID19 in Telangana

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,339
  • కోలుకున్న వారు 3,00,156 మంది
  • మృతుల సంఖ్య 1,688
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 154  మందికి క‌రోనా

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 535 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 278 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,339కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,00,156 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,688గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 4,495 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,979 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 154  మందికి క‌రోనా సోకింది. 
 

  • Loading...

More Telugu News