Anand Mahindra: ట్విట్ట‌ర్‌లో ఆస‌క్తిక‌ర ఫొటోను పోస్ట్ చేసిన ఆనంద్ మ‌హీంద్ర

anand mahindra shares interesting pic

  • అక్ష‌ర్ ప‌టేల్ పెట్టుకునేట‌టువంటి క‌ళ్ల‌ద్దాలు పెట్టుకున్న మ‌హీంద్ర‌
  • టీమిండియా గెలిస్తే పెట్టుకుంటాన‌ని చెప్పిన పారిశ్రామిక‌వేత్త‌
  • ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నాన‌ని ఫొటో ట్వీట్

సామాజిక మాధ్య‌మాల్లో చురుకుగా ఉండే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మ‌రోసారి నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షించారు. ఇంగ్లండ్‌పై టీమిండియా గెలిచి టీ20 సిరీస్ క‌ప్ ను సొంతం చేసుకుంటే భార‌త ఆట‌గాడు అక్షర్‌ పటేల్‌ ధరించే కళ్లద్దాలలాంటివి పెట్టుకుని ఫొటోను పోస్ట్ చేస్తాన‌ని ఆనంద్ మ‌హీంద్ర ఇటీవ‌ల తెలిపారు. అక్షర్‌ పటేల్‌ పెట్టుకునే కళ్లద్దాలు బాగుంటాయ‌ని చెప్పారు.

విజయాన్ని ఆస్వాదించడానికి తనకు కూడా ఆ కళ్లద్దాలు కావాలని ట్వీట్ చేశారు. ఆ బ్రాండ్ పేరు చెప్పాల‌ని, అవి ఎక్కడ దొరుకుతాయని ఆయ‌న‌ నెటిజన్లను అడిగారు. చివ‌ర‌కు తానే అలాంటి కళ్లద్దాలు తెచ్చుకున్నాన‌ని అన్నారు. అయితే, వాటిని ఇప్ప‌ట్లో పెట్టుకోన‌ని టీ20 సిరీస్ ను భార‌త్ గెలిస్తే తప్పకుండా పెట్టుకుంటానని ఇటీవ‌ల‌ తెలిపారు.

తాజాగా, ఆయ‌న ఆ క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని ఫొటోను ట్వీట్ చేస్తూ.. తాను ఇప్పుడు త‌న
మాట‌ను‌ నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ‘అక్షర్‌ షేడ్స్‌’తో సెల్ఫీ తీసుకొని షేర్ చేస్తున్నాన‌ని పేర్కొన్నారు. కాగా, టీవీలో  కోహ్లీ విజ‌యానందంతో పొంగిపోతోన్న దృశ్యం ముందు నిల‌బ‌డి ఆనంద్ మ‌హీంద్ర‌ విక్టరీ సింబల్‌ చూపిస్తూ ఈ ఫొటో తీసుకున్నారు.

Anand Mahindra
Viral Pics
India
  • Error fetching data: Network response was not ok

More Telugu News