ముంబయి పట్ల నా విధేయతను ప్రశ్నించినప్పుడు మౌనంగా రోదించాను: కంగనా రనౌత్
- కొంతకాలంగా కంగనా, మహా సర్కారు మధ్య పోరు
- గతంలో అవినీతిని ప్రశ్నించానన్న కంగనా
- దాంతో బెదిరింపులు, దాడులకు పాల్పడ్డారని వెల్లడి
- కోర్టు సాయంతో ఆస్తులు కాపాడుకున్నానని వివరణ
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై ముంబయి మాజీ పోలీసు అధికారి పరంబీర్ సింగ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో కంగనా స్పందిస్తూ... ఇప్పుడు ఎవరు అవినీతిపరులో, ఎవరు దేశభక్తులో వెల్లడైందని అన్నారు. మున్ముందు వీరి అవినీతి లీలలు మరిన్ని బయటికి వస్తాయని పేర్కొన్నారు.