BJP: తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచార కమిటీ, నియోజకవర్గాల ఇన్చార్జిలను ప్రకటించిన బీజేపీ

BJP announced campaigning committee members

  • ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలు
  • సన్నద్ధమవుతున్న బీజేపీ
  • పార్టీ ముఖ్యులకు కీలక బాధ్యతలు
  • బీజేపీ రాజ్యసభ సభ్యులకు ప్రచార కమిటీలో స్థానం
  • బీజేపీ అభ్యర్థి ప్రకటన తర్వాత జనసేన కమిటీల వివరాలు వెల్లడి

ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రచార కమిటీ ఏర్పాటు చేసింది. అంతేగాకుండా, తిరుపతి పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇనార్జిలను ప్రకటించింది. ప్రచార కమిటీకి కన్వీనర్ గా రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణ, శాంతారెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఐవైఆర్ కృష్ణారావు, దాసరి శ్రీనివాసులు, రావెల కిశోర్ బాబు, వాకాటి నారాయణరెడ్డి, చంద్రమౌళి, సుధీశ్ రాంభొట్లను నియమించారు.

పురందేశ్వరి, సత్యకుమార్ లను ప్రత్యేక ఆహ్వానితులుగా పేర్కొన్నారు. ఎక్స్ అఫిషియో ఆహ్వానితులుగా మురళీధరన్, సునీల్ దేవధర్, సోము వీర్రాజు, నూకల మధుకర్, పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణరాజు, లోకుల గాంధీ పేర్లను ప్రకటించారు.

ఇక సర్వేపల్లి అసెంబ్లీ స్థానం ఇన్చార్జిగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గూడూరు అసెంబ్లీ స్థానం ఇన్చార్జిగా పసుపులేటి సుధాకర్ రెడ్డి, వెంకటగిరి అసెంబ్లీ స్థానం ఇన్చార్జిగా  సూర్యనారాయణ, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వాకాటి నారాయణరెడ్డి, సత్యవేడు అసెంబ్లీ స్థానం ఇన్చార్జిగా చిన్నం రామకోటయ్య, శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానం ఇన్చార్జిగా సైకం జయచంద్రారెడ్డి, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా డాక్టర్ పార్థసారథిలను నియమించారు.

కాగా, ఈ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత జనసేన పార్టీకి చెందిన సమన్వయ కమిటీ వివరాలు ప్రకటిస్తారని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వెల్లడించారు.

BJP
Campaigning Committee
Assembly Incharge
Tirupati LS Bypolls
Andhra Pradesh
  • Loading...

More Telugu News