Ayyanna Patrudu: చంద్రబాబుకు స్టే వచ్చిందని గగ్గోలు పెడుతున్న వైసీపీ నేతలకు చిన్న సూచన: అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu comments on YCP leaders

  • అసైన్డ్ భూముల కేసులో సీఐడీ విచారణ
  • చంద్రబాబు పిటిషన్ నేపథ్యంలో స్టే ఇచ్చిన హైకోర్టు
  • స్టేలతో తప్పించుకుంటున్నాడని వైసీపీ విమర్శలు
  • ట్విట్టర్ లో స్పందించిన అయ్యన్నపాత్రుడు
  • రెడ్లతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించిన మేధావి అంటూ వ్యాఖ్యలు

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుపై సీఐడీ విచారణకు హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో వైసీపీ నేతలు స్టేలు తెచ్చుకుంటూ విచారణ నుంచి తప్పించుకుంటున్నారని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించారు. కోర్టులో స్టే వచ్చింది అని గగ్గోలు పెడుతున్న వైసీపీ నేతలకు చిన్న సూచన అంటూ ట్వీట్ చేశారు.

చంద్రబాబుపై రెడ్లతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించాలనే తింగరి ఐడియా ఇచ్చిన అపర మేధావి ఎవడు? అని జగన్ రెడ్డిని నిలదీయాలని హితవు పలికారు. 1000 కీలక పదవులు రెడ్లకు కట్టబెట్టినంత మాత్రాన ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా రెడ్లే పెడతామంటే చట్టాలు చూస్తూ ఊరుకోవని అయ్యన్న స్పష్టం చేశారు.

Ayyanna Patrudu
YSRCP
Chandrababu
Stay
Insider Trading
Amaravati
AP High Court
  • Loading...

More Telugu News