Vijay Sai Reddy: ఇలా ఎంతకాలం స్టేలతో కాలం వెళ్లదీస్తాడో!: విజ‌య‌సాయిరెడ్డి

vijaya saireddy slams chandrababu naidu

  • సీబీఎన్‌ పేరును ఎప్పుడో స్టేబీఎన్‌గా మార్చారు నెటిజన్లు
  • ఏ తప్పూ చేయకపోతే కేసులు ఎదుర్కోవాలి
  • నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అమరావతి అసైన్డు భూముల విషయంలో చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తును హైకోర్టు నాలుగు వారాలపాటు నిలిపివేసిన విష‌యం తెలిసిందే.

దీనిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందిస్తూ... 'సీబీఎన్‌ పేరును ఎప్పుడో స్టేబీఎన్‌గా మార్చారు నెటిజన్లు. ఏ తప్పూ చేయకపోతే కేసులు ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. ఇలా ఎంతకాలం స్టేలతో కాలం వెళ్లదీస్తాడో. ప్రజలు మాత్రం ఈయన చేసిన అక్రమాలకు స్టేలు ఇవ్వకుండా చిత్తుగా ఓడించి తీర్పు చెప్పారు. శిక్ష అమలు చేశారు' అని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.


Vijay Sai Reddy
YSRCP
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News