తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ కవి మద్దా సత్యనారాయణ ఆత్మహత్య
- కుటుంబ కలహాలతో మనస్తాపం
- పురుగుల మందు తాగి ఆత్మహత్య
- కవిగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు
సత్యనారాయణ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కరప మండలంలోని గురజానపల్లి. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పనిచేసి రిటైరయ్యారు. తనకిష్టమైన సాహిత్య రంగంలో ఉంటూ పలు రచనలు చేశారు. అలాగే, అక్షర సత్య సేవా సంస్థను స్థాపించి దాని ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.