Corona Virus: తెలంగాణ‌లో క‌రోనాతో మ‌రో ముగ్గురి మృతి

Media Bulletin on status of positive cases COVID19 in Telangana

  • కొత్త‌గా 278 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,047
  • మృతుల సంఖ్య 1,662
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 35 మందికి క‌రోనా

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 278 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 111 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,047కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,98,120 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,662గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 2,265 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 830 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 35 మందికి క‌రోనా సోకింది.
  

  • Loading...

More Telugu News