కుప్పకూలిన మిగ్-21 బైసన్.. వాయుసేన పైలట్ మృతి
- గ్వాలియర్ వాయుస్థావరం వద్ద జరిగిన ప్రమాదం
- టేకాఫ్ అవుతుండగానే కూలిన విమానం
- పైలట్ కుటుంబానికి అండగా ఉంటామని ఐఏఎఫ్ హామీ
- విచారణకు ఆదేశించిన అధికారులు
గత 18 నెలల్లో మిగ్-21 శ్రేణి విమానాలు ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి. 2019 సెప్టెంబర్లో ఇదే వాయుస్థావరంలో మిగ్21 ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదాల్లో భారత్ విమానాలను నష్టపోవడంతో పాటు అత్యంత విలువైన ఫైటర్ పైలట్లను కూడా కోల్పోయాం.
రష్యా నుంచి కొనుగోలు చేసి 1960లో వాయుసేనలోకి ప్రవేశపెట్టిన మిగ్-21 ఆధునిక వెర్షన్ విమానాలే ఈ మిగ్-21 బైసన్. పుల్వామా ఉగ్రదాడి తర్వాత 2019, ఫిబ్రవరి 27న పాక్ వాయుసేనతో జరిగిన ఘర్షణలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఇదే మిగ్-21 బైసన్తో శత్రుమూకల ఎఫ్-16ను నేలకూల్చారు.