బెంగాల్ ప్రజలకు మమత శుభవార్త.. పెట్రో ధరల తగ్గింపు
- పెట్రోలు, డీజిల్పై ఒక రూపాయి పన్ను తగ్గింపు
- ప్రభుత్వానికి నష్టమైనా ప్రజలు ఇబ్బంది పడకూడదనేనన్న మంత్రి
- రాష్ట్ర ప్రభుత్వ వనరులను కేంద్రం దోచుకుంటోందని ఆగ్రహం
పెట్రోలుపై పన్నుల రూపంలో కేంద్రం రూ. 32.90 తీసుకుంటోందని, అదే సమయంలో రాష్ట్రాలకు లభిస్తున్నది రూ. 18.46 మాత్రమేనని మమత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. డిజిల్పై రూ. 31.80ను కేంద్రం వసూలు చేస్తుండగా, రాష్ట్రాలకు మాత్రం రూ. 12.77 మాత్రమే లభిస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ సొంత వనరులను కేంద్రం దోచుకుంటోందని ఆరోపించింది. ప్రభుత్వానికి నష్టం కలిగినా ప్రజలపై భారం మోపకుండా ఉండాలనే పెట్రోలు, డీజిల్పై పన్నును తగ్గించినట్టు మంత్రి పేర్కొన్నారు.