Andhra Pradesh: ఏపీ కరోనా అప్ డేట్: కొత్తగా 55 పాజిటివ్ కేసులు

AP Corona cases media update

  • గత 24 గంటల్లో 28,788 కరోనా పరీక్షలు
  • అత్యధికంగా చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 9 చొప్పున కేసులు
  • ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • మరో 117 మందికి కరోనా నయం

ఏపీలో గడచిన 24 గంటల్లో 28,788 కరోనా శాంపిల్స్ పరీక్షించగా 55 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 9, చిత్తూరు జిల్లాలో 9 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 117 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,869 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,80,972 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 735 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,162గా నమోదైంది. వరుసగా రెండోరోజు కూడా ఎలాంటి మరణాలు సంభవించలేదు.

Andhra Pradesh
Corona Virus
Update
Positive Cases
Active Cases
  • Loading...

More Telugu News