GVL Narasimha Rao: బడ్జెట్ పై కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం సహజం: జీవీఎల్

GVL on criticism over union budget

  • ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రకటన
  • విమర్శలు గుప్పించిన విపక్షాలు
  • బడ్జెట్ లో ప్రస్తావన లేకపోతే మొండిచేయి చూపినట్టు కాదన్న జీవీఎల్
  • రెండ్రోజుల్లో పోలవరంపై వివరణ రానుందని వెల్లడి

బీజేపీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీయే సర్కారు ఇవాళ బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ పై విమర్శలు వస్తుండడం పట్ల బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. బడ్జెట్ ప్రకటనపై కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం సహజమని అన్నారు. బడ్జెట్ లో ప్రస్తావన లేనంత మాత్రాన మొండిచేయి చూపినట్టు కాదని స్పష్టం చేశారు. అయినా, కేంద్ర నిధులను తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకోవట్లేదని తెలిపారు. పోలవరంపై రెండ్రోజుల్లో కేంద్రం నుంచి వివరణ రానుందని జీవీఎల్ వెల్లడించారు.

GVL Narasimha Rao
Union Budget 2021-22
BJP
NDA
Andhra Pradesh
Polavaram Project
India
  • Loading...

More Telugu News