Corona Virus: దేశంలో కొత్త‌గా 11,666 మందికి కరోనా

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,01,193
  • మృతుల సంఖ్య 1,53,847
  • కోలుకున్న వారు 1,03,73,606 మంది
  • మొత్తం 23,55,979 మందికి వ్యాక్సిన్లు  
India reports 11666 new COVID19 cases

దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 14,301 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,01,193 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 123 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,847కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,03,73,606 మంది కోలుకున్నారు. 1,73,740  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 23,55,979 మందికి వ్యాక్సిన్లు వేశారు.
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 19,43,38,773  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,25,653 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News