టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్కు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ
- 2012లో కాజీపేట రైల్వే స్టేషన్లో రైల్ రోకో
- వినయ్ భాస్కర్ సహా 9 మందిపై కేసు
- విచారణకు హాజరు కాకపోవడంతో వారెంట్లు
ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళనలో వినయ్ భాస్కర్ సహా మరికొందరు ప్రజాప్రతినిధులు కాజీపేట రైల్వే స్టేషన్లో రైలు రోకో కార్యక్రమం చేపట్టారు. దీంతో అప్పట్లో వీరిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. అయితే, ఈ కేసులో నిందితులుగా ఉన్నవారెవరూ విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు తాజాగా, వారందరికీ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.