Andhra Pradesh: ఏపీలో కొత్తగా 158 పాజిటివ్ కేసులు

  • గడచిన 24 గంటల్లో 44,382 కరోనా టెస్టులు
  • అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 24 కేసులు
  • అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 2 కేసులు
  • యాక్టివ్ కేసుల సంఖ్య 1,476
AP gets few more positive cases

ఏపీలో గడచిన 24 గంటల్లో 44,382 కరోనా పరీక్షలు నిర్వహించగా 158 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 24, విశాఖ జిల్లాలో 22, కృష్ణా జిల్లాలో 20 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 2, కడప జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 6 కేసులు గుర్తించారు. అదే సమయంలో 155 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్క మరణం కూడా సంభవించలేదు. రాష్ట్రంలో నేటివరకు 8,87,010 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,78,387 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ప్రస్తుతం 1,476 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా 7,147 మంది కరోనాతో మృతి చెందారు.

More Telugu News