farmer: మీ త‌న‌యుడికి ఈ విష‌యం చెప్పండి: మోదీ త‌ల్లికి రైతు భావోద్వేగ‌భ‌రిత‌ లేఖ

  • నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాలను ర‌ద్దు చేయ‌మ‌నండి
  • ఢిల్లీ రోడ్ల‌పై ప‌డుకునేలా కేంద్ర ప్ర‌భుత్వం చేస్తోంది
  • ఆందోళ‌న‌ల్లో  పిల్ల‌లు, మ‌హిళలు కూడా  ఉన్నారు
  • త‌ల్లి మాట‌ను ఎవ‌రూ కాద‌నరు
farmer writes letter to modi mother

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాలపై ఢిల్లీ స‌రిహ‌ద్దులో రైతులు ప‌ట్టువిడ‌వ‌కుండా పెద్ద ఎత్తున ఆందోళ‌నలు చేస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, దీనిపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కపోవడంతో ఆయ‌న తల్లికి  పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాకు చెందిన  హ‌ర్‌ప్రీత్ సింగ్ అనే రైతు తాజాగా ఓ లేఖ రాశాడు.

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసేలా కుమారుడి మ‌న‌సును మార్చాలంటూ మోదీ త‌ల్లికి ఆయ‌న విజ్ఞప్తి చేశాడు. మోదీ త‌ల్లిగా త‌న‌కున్న అధికారాల‌న్నింటినీ ఆమె వినియోగించుకోవాల‌ని ఆమె త‌న కుమారుడి మ‌న‌సును మార్చుతార‌ని ఆశిస్తున్నాన‌ని ఆ రైతు లేఖలో పేర్కొన్నాడు.

ఈ చ‌ట్టాల‌ను ఎందుకు ర‌ద్దు చేయాలో వివ‌రాలు చెబుతూ ఆ రైతు లేఖ‌లో వివ‌రించాడు. బాగా చ‌లిగా ఉన్న వాతావ‌ర‌ణంలో ఢిల్లీ రోడ్ల‌పై ప‌డుకునేలా కేంద్ర ప్ర‌భుత్వం చేస్తోంద‌ని ఆయ‌న చెప్పాడు. వృద్ధులు చాలా మంది ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, ఈ ఆందోళ‌న‌ల్లో  పిల్ల‌లు, మ‌హిళలు కూడా  ఉన్నారని తెలిపాడు.

ఈ ఆందోళ‌న‌ల్లో ఇప్ప‌టికే కొంత‌మంది చ‌నిపోయారని వివ‌రించాడు. కేంద్ర ప్ర‌భుత్వం ఈ వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను అదానీ, అంబానీతో పాటు బ‌డా కార్పొరేట్ల‌కు మేలు చేసేలా రూపొందించారని చెప్పాడు.  త‌ల్లి మాట‌ను ఎవ‌రూ కాద‌న‌రని, అందుకే మోదీ త‌ల్లిగా హీరాబెన్ ఆయ‌న‌కు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని సూచ‌న చేయాల‌ని ఆ రైతు కోరాడు.


More Telugu News