Corona Virus: దేశంలో కొత్త‌గా 13,823 మందికి కరోనా

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,95,660
  • మృతుల సంఖ్య 1,52,718
  • కోలుకున్న వారు 1,02,45,741 మంది
  • మొత్తం 18,85,66,947 కరోనా పరీక్షలు
India reports 13823 new COVID19 cases

దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 13,823 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 16,988 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,95,660కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 162 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,718కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,02,45,741 మంది కోలుకున్నారు. 1,97,201 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 18,85,66,947 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,64,120 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News