Andhra Pradesh: ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. అప్ డేట్స్ ఇవిగో!

  • 24 గంటల్లో 203 కొత్త కేసుల నమోదు
  • ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న 231 మంది
  • ప్రస్తుతం రాష్ట్రంలో 2,382 యాక్టివ్ కేసులు
AP registers 203 new Corona cases

ఆంధ్రప్రదేశ్ లో నిన్నటితో పోలిస్తే గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య పెరిగింది. 24 గంటల్లో మొత్తం 203 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 41 కేసులు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యల్పంగా 2 కేసుల వంతున నమోదయ్యాయి. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా వల్ల మృతి చెందారు. గత 24 గంటల్లో 231 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,85,437కి చేరింది. ఇప్పటి వరకు 8,75,921 మంది కోలుకోగా... 7,134 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,24,41,272 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,382 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

More Telugu News