Andhra Pradesh: ఏపీలో కొత్తగా 121 పాజిటివ్ కేసులు

Corona cases number in AP slow downs

  • గత 24 గంటల్లో 30,933 కరోనా టెస్టులు
  • అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 24 కేసులు
  • విజయనగరం జిల్లాలో క్తొత కేసులు నిల్ 
  • మరో ఇద్దరి మృతి

ఏపీలో గడచిన 24 గంటల్లో 30,933 కరోనా పరీక్షలు నిర్వహించగా 121 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 24 కేసులు రాగా, చిత్తూరు జిల్లాలో 23, విశాఖపట్నం జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 12 కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు. శ్రీకాకుళం జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 5, పశ్చిమ గోదావరి జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 213 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. కృష్ణా జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఈ క్రమంలో మొత్తం మరణాల సంఖ్య 7,131కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,85,037 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,75,456 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,450 మందికి చికిత్స జరుగుతోంది.

Andhra Pradesh
Corona Virus
Positive Cases
Deaths
Active Cases
  • Loading...

More Telugu News