Corona Virus: తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్ డేట్స్!

  • కొత్తగా 298 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,433 
  • మృతుల సంఖ్య 1,563  
Telugu Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 298 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర  వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 474 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,433 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,83,048  మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,563 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 4,822 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,614 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 61 కరోనా కేసులు నమోదయ్యాయి.
  

More Telugu News