Ramana Dikshitulu: సీఎం జగన్ కు రమణ దీక్షితులు విన్నపం

Ramana Dikshitulu request to Jagan

  • తేరు మండపం, వెయ్యి కాళ్ల మండపాన్ని పునర్నిర్మించండి
  • స్వామి వారి భక్తులు సంతోషిస్తారు
  • శ్రీవారి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉండాలి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముందు తిరుమల గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సరికొత్త ప్రతిపాదన పెట్టారు. శ్రీవారి తేరు మండపం, వెయ్యి కాళ్ల మండపాన్ని పునర్నిర్మించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు జగన్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఆయన ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు.

ఈ మండపాలను నిర్మిస్తే వెంకన్న స్వామి భక్తులు సంతోషిస్తారని చెప్పారు. దేవాలయాల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభిస్తున్నారని... ఈ శుభసమయంలో ఆయనకు శ్రీవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఆలయాల పునర్నిర్మాణం ఒక చారిత్రాత్మక ఘట్టమని కొనియాడారు.

రమణ దీక్షితులు ఈ విన్నపం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆయన ఈ డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో వెయ్యి కాళ్ల మండపం కూల్చివేతకు గురైందని చెప్పారు. మరి ఆయన విన్నపం  పట్ల ముఖ్యమంత్రి ఏమేరకు స్పందిస్తారో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News