Vikarabad District: సుపారీ ఇచ్చి కన్నకొడుకునే చంపించిన తల్లి

Mother murdered own son in Telangana

  • తాగొచ్చి గొడవ చేస్తున్న కొడుకు
  • తమ్ముడితో కలిసి హత్య చేయించిన తల్లి
  • ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు

కన్నకొడుకుని తల్లి హత్య చేయించిన ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే, వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామానికి చెందిన శివప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పీచరగాడి తండా దగ్గర అతన్ని హతమార్చారు.

శివప్రసాద్ వయసు 17 సంవత్సరాలు. ప్రతి రోజు తాగి వచ్చి ఇబ్బంది పెడుతుండటంతో, అతని తల్లి తట్టుకోలేకపోయింది. ఎంత చెప్పినా వినకపోవడంతో చివరకు హత్య చేయించాలని భావించింది. తన సోదరుడితో కలసి హత్యకు ప్లాన్ వేసింది. సుపారీ ఇచ్చి హత్య చేయించింది. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి తల్లి, మేనమామ సహా ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Vikarabad District
Murder
Mother
Son
  • Loading...

More Telugu News