FasTag: ఫాస్టాగ్ గడువును వచ్చే నెల 15 వరకు పొడిగించిన కేంద్రం

Fastag deadline extended

  • గడువును మరో నెలన్నర రోజులు పెంచిన ప్రభుత్వం
  • ఆ తర్వాతి నుంచి రెట్టింపు ఫీజు వసూలు
  • ప్రస్తుతం 80 శాతం ఫాస్టాగ్ చెల్లింపులు

ఫాస్టాగ్ గడువును మరో నెలన్నర రోజులు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ గడువు నేటితో ముగియనుండగా దానిని ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు టోల్‌ప్లాజాల వద్ద హైబ్రిడ్ లేన్లలో ఫాస్టాగ్‌తోపాటు నగదు కూడా చెల్లించవచ్చని తెలిపింది.

టోల్‌ప్లాజాల వద్ద  ప్రస్తుతం ఫాస్టాగ్‌ను ఉపయోగించి  75-80 శాతం చెల్లింపులు జరుగుతున్నాయి. కాగా, వచ్చే నెల 15 తర్వాత టోల్‌ప్లాజాల వద్ద ఒక్క లైన్ మినహా మిగతా అన్నీ ఫాస్టాగ్‌లుగా మారనున్నాయి. గడువు తర్వాత కూడా ఫాస్టాగ్‌గా మారని వారి నుంచి రెట్టింపు ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • Loading...

More Telugu News