Andhra Pradesh: ఏపీలో మరో 349 కరోనా కేసుల నమోదు.. అప్ డేట్స్ ఇవిగో!

AP registers 349 new Corona cases

  • 24 గంటల్లో నలుగురి మృతి
  • కరోనా నుంచి కోలుకున్న 472 మంది
  • ప్రస్తుతం రాష్ట్రంలో 3,256 యాక్టివ్ కేసులు

ఏపీలో కరోనా ఉద్ధృతి తగ్గినప్పటికీ, కొత్త కేసులు మాత్రం నిలకడగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 55,740 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 349 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో చిత్తూరు, కడప, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. 472 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,81,948కి పెరిగింది. మొత్తం 7,104 మంది మృతి చెందారు. ఇదే సమయంలో 8,71,588 మంది కరోనా నుంచి రికవర్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,256 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Andhra Pradesh
Corona Virus
Updates
  • Loading...

More Telugu News