Ramcharan: చిరంజీవి ‘ఆచార్య’ సెట్‌లో టీ తాగుతూ రామ్ చ‌ర‌ణ్‌.. ఫొటోలు వైరల్

ramcharan pic goes viral

  • కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ 
  • దర్శకుడు కొరటాలతో కలిసి చెర్రీ ముచ్చట
  • కొరటాలతో కలిసి టీ తాగిన చెర్రీ

దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తోన్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఆచార్యలో రామ్‌ చరణ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఆచార్య సెట్‌లో రామ్ చరణ్ అడుగుపెట్టిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో దర్శకుడు కొరటాలతో కలిసి ఆయన టీ తాగుతూ ఉన్నాడు.

అయితే, ఈ సినిమాలో నటించేందుకు రామ్ చరణ్ షూటింగ్ స్పాట్ వద్దకు వచ్చాడా? అన్న విషయం తెలియరాలేదు. సామాజిక అంశం నేపథ్యంలో ఈ సినిమా కథ కొనసాగుతుంది. ఇందులో ఎర్ర కండువాతో చిరంజీవి కనపడిన ఫొటోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. ఆయన ఇందులో నక్సలైటుగా నటిస్తున్నాడు ప్రచారం జరిగింది.

  • Loading...

More Telugu News