Corona Virus: తెలంగాణలో కొత్తగా 472 మందికి కరోనా

new  472 COVID19 infections in telangana

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,84,863
  • కోలుకున్న 2,76,753 మంది
  • మృతుల సంఖ్య మొత్తం 1,531

తెలంగాణలో గత 24 గంటల్లో 472 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 509 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,84,863కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,76,753 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,531కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 6,579 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో4,426 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 106 కరోనా కేసులు నమోదయ్యాయి.  

   

  • Loading...

More Telugu News