Odisha: తొమ్మిది నెలల తర్వాత తెరుచుకున్న పూరి జగన్నాథుడి ఆలయ ద్వారాలు.. 3 నుంచి భక్తులందరికీ అనుమతి!

Jagannath Temple In Puri Reopens After 9 Months
  • కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 20న ఆలయ ద్వారాల మూత
  • స్వామి, అమ్మవార్ల దైనందిన సేవలకు మాత్రమే అనుమతి
  • 1, 2 తేదీల్లో మళ్లీ మూత
కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 20న మూతపడిన ఒడిశాలోని ప్రసిద్ధ పూరి దేవాలయ ద్వారాలు మళ్లీ తెరుచుకున్నాయి. 9 నెలలపాటు మూతపడిన జగన్నాథుడి ఆలయ ద్వారాలను అధికారులు నిన్న తెరిచారు. ఈ నెల 26 నుంచి 31 వరకు స్థానిక భక్తులకు, జనవరి 3 నుంచి అన్ని ప్రాంతాల భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు.

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతో జనవరి 1, 2 తేదీలలో ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆలయం లోపల జగన్నాథ, బలబద్ర, సుభద్రల దైనందిన సేవలకు మాత్రమే అధికారులు అనుమతించారు. అలాగే, ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రేపటి వరకు సేవాయత్‌ల కుటుంబాలకు మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు.
Odisha
Puri Temple
Reopen
Corona Virus

More Telugu News