Corona Virus: దేశంలో కొత్తగా 19,556 మందికి కరోనా పాజిటివ్

India records 19556 new COVID19 cases

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,75,116
  • మృతుల సంఖ్య 1,46,111
  • కోలుకున్న వారు 96,36,487 మంది
  • మొత్తం 16,31,70,557 కరోనా పరీక్షలు  

దేశంలో గత 24 గంటల్లో 19,556 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 30,376 మంది కోలుకున్నారు.  దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,75,116కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 301 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,46,111కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 96,36,487 మంది కోలుకున్నారు. 2,92,518 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 16,31,70,557 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 10,72,228 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News