KTR: జనవరి మొదటివారంలో హైదరాబాదులో ఉచిత తాగునీటి సరఫరా పథకం ప్రారంభం: కేటీఆర్ వెల్లడి

  • నగరంలో 20 వేల లీటర్ల వరకు తాగునీరు ఫ్రీ
  • సీఎం కేసీఆర్ హామీ అమలు చేస్తున్నామన్న కేటీఆర్
  • జలమండలి అధికారులతో సమీక్ష
  • డిసెంబరు నెల బిల్లుపై ప్రత్యేక ఆదేశాలు
  •  20 వేల లీటర్ల వరకు రుసుము వద్దని స్పష్టీకరణ
TS Minister KTR reviews free water scheme in Hyderabad

హైదరాబాదులో ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని జనవరి మొదటి వారంలో ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జలమండలి అధికారులతో కేటీఆర్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు డిసెంబరు నెల నుంచి 20 వేల లీటర్ల వరకు ఎలాంటి రుసుము వసూలు చేయబోమని తెలిపారు. హైదరాబాద్ నగర ప్రజలందరికీ ఈ పథకంతో ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఈ పథకం అమలుకు రాబోయే రెండు వారాల్లో ఏర్పాట్లు చేసుకోవాలని కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

More Telugu News