రైతులకు నీళ్లు ఇవ్వకపోతే.. మళ్లీ పాత ఫ్యాక్షన్ పరిస్థితులు వస్తాయి: భూమా అఖిలప్రియ
- ఆళ్లగడ్డ హైవేపై మెరుపు ధర్నాకు దిగిన అఖిలప్రియ
- నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆందోళన
- ఎకరాకు రూ. 50 వేల పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్
రైతులకు నష్ట పరిహారం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అఖిలప్రియ హెచ్చరించారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆళ్లగడ్డలో మళ్లీ పాత ఫ్యాక్షన్ పరిస్థితులు వస్తాయని చెప్పారు. మరోవైపు ఈ ధర్నా వల్ల హైవేపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. నిరసనలకు అనుమతి లేదని, ఆందోళనను విరమించాలని అఖిలప్రియను పోలీసులు కోరారు. అయినా చాలా సేపు వారు రోడ్డు మీదే బైఠాయించారు.