పాత పద్ధతి ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేయాలి: కోమటిరెడ్డి
- మూడు నెలల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి
- ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
- కేసీఆర్ తన పద్ధతిని మార్చుకోవాలి
ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని కోమటిరెడ్డి అన్నారు. ఎల్ఆర్ఎస్ ను పక్కన పెట్టకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. కేసీఆర్ తీరు పిచ్చి తుగ్లక్ చర్యలను తలపిస్తోందని దుయ్యబట్టారు. ఇకనైనా కేసీఆర్ తన పద్ధతిని మార్చుకోవాలని... లేనిపక్షంలో ప్రగతిభవన్ గడీలను బద్దలు కొడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగించాలని హితవు పలికారు.