Corona Virus: దేశంలో 99 లక్షలు దాటిన కరోనా కేసులు

Indias total cases rise to 9906165

  • 24 గంటల్లో 22,065 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,06,165
  • మృతుల సంఖ్య 1,43,709
  • కోలుకున్న వారు 94,22,636 మంది  

భారత్‌లో గత 24 గంటల్లో 22,065 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,06,165కు చేరింది. ఇక గత 24 గంటల్లో 34,477 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 354 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,43,709కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 94,22,636 మంది కోలుకున్నారు. 3,39,820 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 15,55,60,655 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,93,665 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News