Maoists: కాల్పులతో దద్దరిల్లిన ఆంధ్రా-ఒడిశా బోర్డర్... ఇద్దరు మావోల మృతి

Two maoists killed in Andhra Odisha border

  • ఏవోబీలో మళ్లీ కాల్పుల కలకలం
  • సింగారం అటవీప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్
  • సాయుధ బలగాలకు ఎదురుపడిన నక్సల్స్
  • ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు
  • మృతుల్లో ఒకరు మహిళా మావోయిస్టు

గతకొంతకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఇవాళ వేకువ జామున జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సింగారం అటవీప్రాంతంలోని దిగువజనభ వద్ద కాల్పులు చోటుచేసుకున్నాయి.

సింగారం అటవీప్రాంతంలో ఒడిశా వలంటీర్ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోలు తారసపడ్డారు. దాంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. కాగా, మృతిచెందిన మావోయిస్టుల్లో ఓ మహిళ కూడా ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Maoists
Andhra
Odisha
Border
Singaram
Police
  • Loading...

More Telugu News