Farmers Protest: మీ వద్ద ఆ సమాచారం ఉన్నట్టయితే వెంటనే సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి: కేంద్రానికి శివసేన సలహా

Conduct surgical strikes on Pak and China says Shivsena

  • రైతుల ఆందోళన వెనుక చైనా, పాక్ ఉందన్న కేంద్ర మంత్రి
  • ఇది చాలా సీరియస్ విషయమన్న సంజయ్ రౌత్
  • రాష్ట్రపతి, ప్రధాని చర్చించాలని వ్యాఖ్య

రైతుల నిరసన కార్యక్రమాల వెనుక పాకిస్థాన్, చైనాల హస్తం ఉందని కేంద్ర మంత్రి రావ్ సాహెబ్ దాన్వే వ్యాఖ్యానించారు. ఆందోళనల్లో పాల్గొంటున్న వారు రైతులు కాదని చెప్పారు. ఎన్నార్సీ, సీఏఏ ల విషయంలో కూడా ముస్లింలను రెచ్చగొట్టారని... ఆరు నెలల్లో ముస్లింలు భారత్ వదిలి వెళ్లే పరిస్థితి ఉంటుందని రెచ్చగొట్టారని... ఇప్పటి వరకు ఒక ముస్లిం అయినా దేశం విడిచి వెళ్లారా? అని ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ... అదే నిజమైతే చైనా, పాకిస్థాన్ లపై వెంటనే సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని అన్నారు. రైతుల ఆందోళనల వెనుక ఆ దేశాల హస్తం ఉందనే సమాచారం ఉన్నట్టైతే... ఆ దేశాలపై రక్షణ మంత్రి వెంటనే సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని చెప్పారు. ఇది చాలా తీవ్రమైన విషయమని... రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి, త్రివిధ దళాల అధిపతులు వెంటనే దీనిపై చర్చించాలని అన్నారు.

  • Loading...

More Telugu News