Corona Virus: దేశంలో కొత్తగా 31,522 మందికి కరోనా నిర్ధారణ

 Indias total cases rise to 9767372

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,67,372
  • మృతుల సంఖ్య 1,41,772
  • కోలుకున్న వారు 92,53,306 మంది  

దేశంలో కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. గత 24 గంటల్లో 31,522 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,67,372కు చేరింది. ఇక గత 24 గంటల్లో 37,725 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 412 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,41,772కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 92,53,306 మంది కోలుకున్నారు. 3,72,293 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 15,07,59,726  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,22,959 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News