Andhra Pradesh: ఏపీ కరోనా అప్ డేట్: 599 కొత్త కేసులు, 6 మరణాలు

State corona update

  • గత 24 గంటల్లో 63,406 పరీక్షలు
  • అత్యధికంగా కృష్ణా జిల్లాలో 115 కేసులు
  • అత్యల్పంగా విజయనగరంలో  8 కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం మునుపటి స్థాయిలో లేదన్నది ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి. గత 24 గంటల్లో 63,406 కరోనా పరీక్షలు నిర్వహించగా 599 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 115 కొత్త కేసులు వచ్చాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 8 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 913 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7,020కి చేరింది.

ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 8,70,675 కాగా 8,57,233 మంది వైరస్ ప్రభావం నుంచి విముక్తులయ్యారు. ఇంకా 6,422 మంది చికిత్స పొందుతున్నారు.

Andhra Pradesh
Update
Corona Virus
Positive Cases
Deaths
  • Loading...

More Telugu News