Swamy Goud: పార్టీ మార్పు వార్తల్లో నిజం లేదు: టీఆర్ఎస్ నేత స్వామి గౌడ్

I will tell if i joins in BJP says swamy goud

  • బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలను కలిసిన స్వామిగౌడ్
  • పార్టీ మార్పుపై మొదలైన ఊహాగానాలు
  • పార్టీ మారితే చెబుతానన్న స్వామిగౌడ్

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో చేరికలు పెరిగాయి. కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ నుంచి కూడా పలువురు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు పార్టీలో చేరికకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్..  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిలను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన కూడా బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది.

ఈ వార్తలపై స్వామిగౌడ్ స్పందించారు. పార్టీ మార్పు వార్తల్లో నిజం లేదని, ఏదైనా ఉంటే ముందు మీడియాకు చెబుతానని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలను కలవకూడదన్న నిబంధనేమీ లేదని, తాను వారిని స్నేహపూర్వకంగానే కలిసినట్టు స్వామిగౌడ్ వివరించారు.

Swamy Goud
BJP
TRS
Telangana
  • Loading...

More Telugu News