Nivetha Peturaj: నివేద పేతురాజ్ కి మరో సినిమా ఛాన్స్

  • 'మెంటల్ మదిలో' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ 
  • పేరుతెచ్చిన 'అల వైకుంఠపురములో'
  • తాజాగా విష్వక్ సేన్ 'పాగల్'లో ఛాన్స్    
Nivetha Peturaj gets another chance in Tollywood

అందం, అభినయం వున్న అమ్మాయిలకు టాలీవుడ్ ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది. అందుకే, ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి, ఎంతోమంది అమ్మాయిలు ఇక్కడ కథానాయికలుగా రాణిస్తుంటారు. ఆ క్రమంలో యువ కథానాయిక నివేద పేతురాజ్ కూడా ఇప్పుడు తెలుగులో బిజీ అవుతోంది.

'మెంటల్  మదిలో' సినిమాతో తెలుగుకి పరిచయమైన ఈ తమిళ ముద్దుగుమ్మ ఆ తర్వాత 'బ్రోచేవారెవరురా' సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం నివేదకు మరింత పేరుతెచ్చింది. ప్రస్తుతం రామ్ సరసన 'రెడ్' సినిమాలోనూ, సాయితేజ్ పక్కన మరో సినిమాలోనూ నటిస్తోంది.

ఈ క్రమంలో ఈ చిన్నదానికి తాజాగా టాలీవుడ్ నుంచి మరో ఆఫర్ కూడా వచ్చింది. విష్వక్ సేన్ నటిస్తున్న 'పాగల్' చిత్రంలో ఓ కథానాయికగా నివేద ఎంపికైంది. నరేశ్ కుప్పులి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భావోద్వేగాలతో కూడిన లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది.

More Telugu News