ఇంద్రగంటి డైరెక్షన్ లో సుధీర్ బాబు రొమాంటిక్ డ్రామా
- ఇంద్రగంటి, సుధీర్ కాంబినేషన్ లో మూడో చిత్రం
- గతంలో సమ్మోహనం, వి చిత్రాలు
- బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై నూతన చిత్రం
బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కబోతున్న ఈ సినిమాకు బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లాపల్లి నిర్మాతలు. దీపావళి పర్వదినం సందర్భంగా ఈ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు ట్విట్టర్ లో స్పందించారు. అద్భుతమైన టీమ్ మళ్లీ కలుస్తోందని, ఓ అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాం అంటూ అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.