Andhra Pradesh: ఏపీ కరోనా అప్ డేట్: 1,593 పాజిటివ్ కేసులు, 10 మంది మృతి

AP Corona cases update

  • గత 24 గంటల్లో 80,737 కరోనా టెస్టులు
  • అత్యధికంగా తూర్పు గోదావరిలో 259 కేసులు
  • అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 42 కేసులు
  • 2,178 మందికి కరోనా నయం

ఏపీలో గత 24 గంటల్లో 80,737 కరోనా టెస్టులు నిర్వహించగా 1,593 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 259 కేసులు రాగా, అత్యల్పంగా విజయనగరంలో 42 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో మృతి చెందగా, 2,178 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఏపీలో ఇప్పటివరకు 8,51,298 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,24,189 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,262 మందికి చికిత్స కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6,847కి చేరింది.

Andhra Pradesh
Corona Virus
Update
Positive Cases
Deaths
  • Loading...

More Telugu News