Corona Virus: దేశంలో మరో 44,281 మందికి కరోనా నిర్ధారణ

44281 new COVID19 infections in India

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,36,012 
  • మృతుల సంఖ్య 1,27,571
  • కోలుకున్న వారు 80,13,784 మంది

దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 44,281 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,36,012 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 50,326 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 512 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,27,571 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 80,13,784 మంది కోలుకున్నారు. 4,94,657 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.          
      
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 12,07,69,151 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,53,294 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News