Kakinada: కరోనాతో కన్నుమూసిన వైసీపీ కాకినాడ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్!

Kakinada YCP President Died With Corona

  • కాకినాడ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రూటీ కుమార్
  • ఇటీవల కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స
  • నేడు జరగనున్న అంత్యక్రియలు

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్, కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల ఆయనకు మహమ్మారి సోకడంతో, విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్సను పొందుతున్నారు. పరిస్థితి విషమించి, పలు అవయవాలు దెబ్బతినడంతో, ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఇటీవలే ఫ్రూటీ కుమార్ భార్య చంద్రకళా దీప్తికి ఫోన్ చేసిన వైఎస్ జగన్, ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఫ్రూటీ కుమార్ మరణంతో కాకినాడ వైసీపీ నేతల్లో విషాదం నెలకొంది. ఆయన పార్టీకి ఎంతో సేవ చేశారని పలువురు నేతలు కొనియాడారు. ఫ్రూటీ కుమార్ మృతిపట్ల మంత్రులు, జిల్లా నేతలు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Kakinada
East Godavari District
FrutyKumar
YSRCP
Corona Virus
  • Loading...

More Telugu News