Telangana: కోలుకుంటున్న తెలంగాణ.. ఏడు జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నిల్

Telangana register 582 new corona cases

  • 24 గంటల్లో 582 కేసుల నమోదు
  • కరోనా కారణంగా నలుగురి మృతి
  • రాష్ట్రంలో ప్రస్తుతం 18,611 యాక్టివ్ కేసులు

ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తెలంగాణలో భారీ సంఖ్యలో కొత్త కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 582 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఏడు జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. గత 24 గంటల్లో కరోనా బారిన పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,611 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 2,31,834కి చేరుకుంది. మొత్తం 1,311 మంది మృతి చెందారు.  

గత 24 గంటల్లో జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, ములుగు, నారాయణపేట్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 174, నల్గొండ జిల్లాలో 87, రంగారెడ్డి జిల్లాలో 55, మేడ్చల్ జిల్లాలో 38, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో ఆదిలాబాద్ 9, జగిత్యాల్‌ 14, జనగాం 2, జోగులమ్మ గద్వాల్‌ 4, కరీంనగర్‌ 15, ఖమ్మం 17, మహబూబ్‌ నగర్‌ 15, మహబూబాబాద్‌ 13, మంచిర్యాల్‌ 2, మెదక్‌ 4, నాగర్‌ కర్నూల్‌ 6, నల్గొండ 87, నిజామాబాద్‌ 24, రాజన్న సిరిసిల్ల 4, సంగారెడ్డి 31, సిద్ధిపేట్‌ 15, సూర్యాపేట 4, వికారాబాద్‌ 4, వనపర్తి  1, వరంగల్‌ రూరల్‌ 7, వరంగల్‌ అర్బన్‌ 13, యాద్రాది భువనగిరి 2 కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News