Flipkart: ఫ్లిప్ కార్ట్ దీపావళి సేల్స్.. సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లపై భారీ డిస్కౌంట్లు!

  • ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్, దసరా సేల్స్ తో ఆకట్టుకున్న ఫ్లిప్ కార్ట్
  • అక్టోబర్ 29 నుంచి దివాలి సేల్స్
  • మొబైల్స్ పై 80 శాతం వరకు ఆఫర్లు
FlipKart announces Diwali sale

ఇటీవలే బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించిన ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో సేల్ జాతరకు తెరతీసింది. దివాలి సేల్ పేరుతో తన కస్టమర్ల ముందుకు వస్తోంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4 వరకు దివాలి సేల్ ఆఫర్ ఉంటుందని ప్రకటించింది. అక్టోబర్ 17 నుంచి 21 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ జరిగింది. ప్రస్తుతం ఉన్న దసరా స్పెషల్ సేల్ అక్టోబర్ 28 వరకు కొనసాగనుంది. ఇది ముగిసిన వెంటనే దివాలి సేల్ ప్రారంభం కానుంది.

దివాలి సేల్స్ ద్వారా మొబైల్స్, టీవీలు, ఇతర ప్రాడక్ట్ లపై డిస్కౌంట్లతో పాటు స్పెషల్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటివి క్యాష్ బ్యాక్ ఆఫర్లను ఇస్తున్నాయని చెప్పింది. బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐలతో పాటు పలు బ్యాంకులు నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్లను అందించబోతున్నాయని తెలిపింది.

కెమెరాలు, ల్యాప్ టాపులు, స్మార్ట్ వాచీలు, హెడ్ ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు ఆఫర్లను వినియోగదారులు ఎక్స్ పెక్ట్ చేయవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై 80 శాతం వరకు డిస్కౌట్లు లభిస్తాయిని... ల్యాప్ టాప్ లపై 50 శాతం వరకు డివైజెస్ లపై బెనెఫిట్స్ ఉంటాయని చెప్పింది.

కొన్ని రిపోర్టుల ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41, శాంసంగ్ గెలాక్సీ ఎస్20ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్, పోకో ఎం2, పోకో ఎం2ప్రో, పోకో సీ3, రెనో 2ఎఫ్, ఒప్పో ఏ52, ఒప్పో ఎఫ్15, రియల్ మీ నార్జో 20 సిరీస్ తదితర ఫోన్లపై ఈ డిస్కౌంట్లు ఉండవచ్చని తెలుస్తోంది. ఒక్క రూపాయికే మొబైల్ ప్రొటెక్షన్ ఇవ్వనున్నట్టు సమాచారం.

More Telugu News