నారా లోకేశ్ కు తెలియకపోతే వాళ్ల నాన్నను అడిగి తెలుసుకోవాలి: బొత్స
- వరద నష్టం విషయంలో ప్రభుత్వంపై నారా లోకేశ్ విమర్శలు
- జగన్ వాస్తవ పరిస్థితిని చూడాలని డిమాండ్
- వర్షాలు తగ్గాక నష్టాన్ని అంచనా వేస్తామన్న బొత్స
ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ లోకేశ్ పై మండిపడ్డారు. నారా లోకేశ్ కు ఇంకా అంత పరిజ్ఞానం రాలేదని బొత్స ఎద్దేవా చేశారు. వర్షాలు తగ్గకుండానే నష్టాన్ని ఎలా అంచనా వేస్తారని ప్రశ్నించారు. ఆయనకు తెలియకపోతే ఆయన తండ్రి చంద్రబాబును అడిగి తెలుసుకోవాలని అన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత నష్టాన్ని అంచనా వేసి, తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.