Corona Virus: దేశంలో 71 లక్షలు దాటిన కరోనా కేసులు

Indias COVID19 tally crosses 71lakh mark

  • గత 24 గంటల్లో 66,732 మందికి కరోనా నిర్ధారణ 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,20,539
  • మృతుల సంఖ్య 1,09,150
  • నిన్నటి వరకు మొత్తం 8,78,72,093 కరోనా పరీక్షలు

భారత్‌లో గత 24 గంటల్లో 66,732 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,20,539 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 816 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,09,150 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 61,49,536 మంది కోలుకున్నారు. 8,61,853 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.          
        
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 8,78,72,093 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,94,851 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News