Kurnool District: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, న్యాయవాది సుబ్బారాయుడు దారుణ హత్య

YSRCP Leader killed in Nandyal

  • ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఘటన
  • మాటువేసి కర్రలతో దాడిచేసిన గుర్తు తెలియని దుండగులు
  • ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం

కర్నూలు జిల్లాలో వైసీపీ నేత, న్యాయవాది సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు. వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన సుబ్బారాయుడు ఉదయం వాకింగ్‌ కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లారు. సమీపంలోనే ఆయన కోసం మాటు వేసిన గుర్తు తెలియని వ్యక్తులు సుబ్బారాయుడు రాగానే కర్రలతో దాడిచేశారు.

 తీవ్రంగా గాయపడిన సుబ్బారాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలం నుంచి క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Kurnool District
Nandyal
YSRCP
Murder
Crime News
  • Loading...

More Telugu News