స్విమ్స్ మృతురాలి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం: మంత్రి ఆళ్ల నాని
- కోవిడ్ సెంటర్ పెచ్చులు ఊడిపడి రాధిక మృతి
- గాయపడ్డవారికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం
- రాధిక మరణంపై ఆళ్ల నాని ఆవేదన
రాధిక భర్త కూడా స్విమ్స్ లోనే పదేళ్లకు పైగా ఎంఎన్ఓగా పనిచేస్తున్నారు. ఆరేళ్ల క్రితం వీరికి పెళ్లయింది. రెండేళ్ల క్రితం వీరి ఇద్దరి కుమారులు వారం వ్యవధిలోనే తీవ్రమైన జ్వరంతో చనిపోయారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పుడు ఆమె మళ్లీ గర్భం దాల్చడంతో ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆమె ప్రమాదవశాత్తు చనిపోవడం బాధాకరం. ఆమె భర్త హరి పరిస్థితి దారుణంగా ఉంది. సర్వస్వాన్ని కోల్పోయానంటూ ఆయన రోదిస్తున్నారు.