Corona Virus: దేశంలో కొవిడ్‌-19 కేసుల అప్‌డేట్స్‌

spike of 74442 new cases in india

  • కొత్తగా 74,442 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,23,816 
  • మృతుల సంఖ్య 1,02,685
  • కోలుకున్న వారు 55,86,704 మంది  

భారత్‌లో గత 24 గంటల్లో 74,442 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,23,816 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 903 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,02,685 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 55,86,704 మంది కోలుకున్నారు. 9,34,427 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.          
           
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 7,99,82,394 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,89,860 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News