Corona Virus: దేశంలో 60 లక్షలకు చేరువైన కరోనా కేసుల సంఖ్య

  • గత 24 గంటల్లో దేశంలో 88,600 మందికి నిర్ధారణ
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,92,533
  • మృతుల సంఖ్య మొత్తం 94,503
singleday spike of 88600 new COVID19 cases

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 60 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో దేశంలో 88,600 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,92,533కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,124 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 94,503కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 49,41,628 మంది కోలుకున్నారు. 9,56,402 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
              
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 7,12,57,836 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,87,861 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News